10, నవంబర్ 2012, శనివారం

రిఫర్మేషన్ 2017 ఇండియా 

 ఒక విశ్వాస పునరంకిత ఉద్యమం. 2017 లో జరిగే దిద్దుబాటు పండుగ పంచ శతాబ్ది సంబరాలను సమైక్యంగా జరుపుకొనెందుకు తెలుగునాట గల అన్ని ప్రొటెస్టెంట్ సంఘాలను సంసిద్ధం చేసేందుకు సువార్త జ్వాల దేన్ని ప్రారంభించింది. 2017 లో ఈ పండుగను ఒక లక్ష మంది విశ్వాసులతో దేవుని నామ మహిమర్ధం జరుపుకోవాలన్నది మా లక్ష్యం. ఈ ఐదేళ్ళలో 500 ల సంఘాలను దర్శించి ఈ పండుగ ప్రాశస్థ్యతను తెలియ చెప్పేందుకు అనేక ప్రాంతాలను దర్శిస్తున్నాం. 

గుంటూరులో  లక్ష మంది విశ్వాసులతో జరుపనైయున్న ఈ వుత్సవంలో 500 కిలోల కేక్ ను కట్ చెయ్యాలని ఆశిస్థున్నాం. ఆలాగే 500 మీటర్ల బానర్ను ప్రదర్శించాలనుకుంటున్నాము. ఇంకా 500 కిలో మీటర్ల శిలువ యాత్రను చేపట్టెందుకు సంసిద్దులమౌతున్నాం. అలాగే రిఫర్మేషన్ స్ఫూర్తితో ఐదు వేల బైబిల్సును క్రైస్తవేతరులకు అందించేదుకు ప్రణాళికను కలిగున్నాం

ఈ బ్రుహత్తర కార్యంలో మీ వంతు సహకారాన్ని ప్రార్ధనా పుర్వకంగా అందిస్తారని ఆశిస్తున్నాము. 

మీ రవి ప్రసాద్